యువకుడి కంటిపై పెల్లెట్ ప్రభావం

ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన ఆందోళనలో ఒక నిరసనకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆందోళన సమయంలో పెల్లెట్లు కంటిలోకి దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆయన్ని మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కన్నును కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. నీట్, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP పిలుపునిచ్చిన ఆందోళన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారు.


