కర్నూలులో TDP కార్యకర్త దారుణ హత్య

AP: కర్నూలులో TDP కార్యకర్త ఇంతియాజ్ దారుణ హత్యకు గురయ్యారు. తన స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా మాటామాటా పెరిగి గొడవపడ్డారు. పక్కనే ఉన్న వక్తి ఇంతియాజ్పై రాయితో దాడి చేయగా అక్కడిక్కడే చనిపోయాడు. గత ఎన్నికల్లో ఇంతియాజ్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. తరువాత TDPలో చేరి పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. భూ వివాదాల కారణాలతో హత్య జరిగి ఉండొచ్చన్న పర్స్పెక్టివ్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతియాజ్ హత్యను మంత్రి టీజీ భరత్ ఖండించారు.



