షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం

హైదరాబాద్ చైతన్యపురిలోని న్యూమారుతీనగర్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భట్టు స్వరాజ్కుమార్ షేర్ మార్కెట్లో భారీ లాభాల పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.74 లక్షలు కోల్పోయారు. ఆల్ఫా ఇన్వెస్టర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించిన నిందితులు నకిలీ లాభాల వివరాలు చూపించి బాధితుడిని నమ్మించారు. దశలవారీగా పెట్టుబడులు పెట్టించిన తర్వాత డబ్బు విత్డ్రా చేసేందుకు మరిన్ని చెల్లింపులు కోరడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



