సాయికృష్ణ కేసులో CI నాగరాజు విచారణ

AP: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో తన కొడుకు కోసం వేసిన పిటిషన్ను తన అనుమతి లేకుండానే వెనక్కి తీసుకునేందుకు తన లాయర్ ప్రయత్నించారని చెప్పడం సెన్సేషన్ అయ్యింది. ఆ లాయర్ను తీసేసి ఈ కేసును CBIకి అప్పగించాలని మరో లాయర్తో పిటిషన్ వేశారు. మరోవైపు జైలులో ఉన్న CI నాగరాజును SIT అధికారులు వారం పాటు విచారించనున్నారు. కోర్టు ఆదేశాలతో రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీసీ కెమెరాల మధ్య విచారణ జరపనున్నారు.



