అప్పు తీర్చలేదని ఇల్లు అమ్మేశాడు

AP: తనకు రావాల్సిన రూ.40వేల అప్పు కోసం గిరిజన మహిళకు తెలియకుండానే ఆమె ఇంటిని విక్రయించిన ఘటన తిరుపతి జిల్లా KVB పురం మండలం అంజూరు గిరిజన కాలనీలో వెలుగులోకి వచ్చింది. భర్త శీనయ్య మృతి అనంతరం నందిని తన పిల్లలతో కలిసి అమ్మగారి ఇంటికి వెళ్లింది. గ్రామ మాజీ సర్పంచి శ్రీజయ భర్త సురేష్ తన ఇంటిని రూ.2 లక్షలకు విక్రయించినట్లు ఆమె ఆరోపించింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉండటంతో విషయం తెలిసిందని వాపోయింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.



