← Back to news

అప్పు తీర్చలేదని ఇల్లు అమ్మేశాడు

By DK· 2 Aug 2026· తిరుపతి జిల్లా
అప్పు తీర్చలేదని ఇల్లు అమ్మేశాడు

AP: తనకు రావాల్సిన రూ.40వేల అప్పు కోసం గిరిజన మహిళకు తెలియకుండానే ఆమె ఇంటిని విక్రయించిన ఘటన తిరుపతి జిల్లా KVB పురం మండలం అంజూరు గిరిజన కాలనీలో వెలుగులోకి వచ్చింది. భర్త శీనయ్య మృతి అనంతరం నందిని తన పిల్లలతో కలిసి అమ్మగారి ఇంటికి వెళ్లింది. గ్రామ మాజీ సర్పంచి శ్రీజయ భర్త సురేష్ తన ఇంటిని రూ.2 లక్షలకు విక్రయించినట్లు ఆమె ఆరోపించింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉండటంతో విషయం తెలిసిందని వాపోయింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.