బాంబ్ ఫార్ములా రాస్తూ దొరికిన మెడికల్ స్టూడెంట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో రాజ్శ్రీ దశరథ్ మెడికల్ కాలేజీలో ఫస్టియర్ పారామెడికల్ స్టూడెంట్ బాంబ్ ఫార్ములాను రాస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. నైట్ డ్యూటీ టైమ్లో దీన్ని గుర్తించిన కాలేజ్ మేనేజ్మెంట్ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో ఆ స్టూడెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఘటనపై మరింత ఇన్ఫర్మేషన్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



