← Back to news

కేంద్ర మంత్రికి కంప్లైంట్.. టీచర్లపై వేటు

By dk· 15 Aug 2026· కడప జిల్లా
కేంద్ర మంత్రికి కంప్లైంట్.. టీచర్లపై వేటు

AP: కడప జిల్లా విద్యాశాఖలో మెగా DSC వ్యవహారం కలకలం రేపింది. DSC నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన వేంపల్లి మండలంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా, శాఖాపరమైన ముందస్తు అనుమతి లేకుండా ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారన్న కారణంతో సంగమేశ్వరరెడ్డి, అమర్నాథరెడ్డి, వెంకటనాథరెడ్డిలను సస్పెండ్ చేస్తూ కడప జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు.

More in AP