‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు

దళిత-బహుజన వర్గాల గొంతుకగా ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, శ్రమను, సమానత్వాన్ని, సామూహిక జీవన విలువలను గౌరవించే దళితబహుజన సంస్కృతిని ప్రాధాన్యం ఇచ్చిన పుస్తకంగా ఈ రచన పేరు తెచ్చుకుంది. అదే స్థాయిలో వివాదాస్పదంగానూ మారింది. 18వ తేదీ మంగళవారం హైదరాబాద్ నగరంలోని లామకాన్లో కంచ ఐలయ్యతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో స్పీకర్స్గా ప్రొ.జ్యోతిర్మయశర్మ, గీతారామస్వామి, పల్లికొండ మణికంఠ ఉంటారు.



