← Back to news

ప్రేమ వివాదంతో యువకుడి ఆత్మహత్య

By RK· 30 Jul 2026
ప్రేమ వివాదంతో యువకుడి ఆత్మహత్య

AP: చోడవరంలోని ద్వారకానగర్లో లక్కరాజు ప్రశాంత్(23) బీటెక్ పూర్తి చేసి GATE పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయితో గొడవ జరగడంతో బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అతనికి తల్లి, తాపీ పని చేసే తండ్రి నాయుడు, ఒక సోదరుడు ఉన్నారు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. SI జోగారావు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 12h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.