← Back to news

మూసీ నుంచి చికాగో దాకా.. హిస్టరీ ఛేదిస్తున్న మిలింద్

By charvaka· 17 Jul 2026
మూసీ నుంచి చికాగో దాకా.. హిస్టరీ ఛేదిస్తున్న మిలింద్

24 ఏళ్ల హైదరాబాదీ కెమెరాతో చరిత్రకు జీవం పోస్తున్నాడు. అమెరికాలో MA హిస్టరీ చేస్తున్న రాహుల్ మిలింద్.. తనే స్టోరీ, కెమెరా, మ్యూజిక్, డైరెక్షన్ చేస్తూ 3 డాక్యుమెంటరీస్ తీశాడు. మూసీ చరిత్ర, 1984 సిక్కుల ఊచకోత డాక్యుమెంటరీస్ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ గెలిచాయ్. దక్షిణాసియా నుంచి చికాగోకు వలస వెళ్లిన వారి అనుభవాలతో తీసిన "The Shape of Belonging" జులై 18న చికాగో సౌత్ ఏషియా ఇన్ స్టిట్యూట్లో ప్రదర్శిస్తున్నారు. రామచంద్ర గుహ శిష్యుడైన రాహుల్ మిలింద్ తెలంగాణ ఉద్యమకారుడు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VC ఘంటా చక్రపాణి కుమారుడు.

More in Education