భార్య హత్య.. భర్తపై ఆరోపణలు
AP: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కొత్తపల్లిలో పద్మావతి అనే మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనలో ఆమె భర్త సురేష్పై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. 'తల్లికి వందనం' పథకం కింద వచ్చిన డబ్బు విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని మృతురాలి తల్లి కళావతి ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



