2 లక్షల పిటిషన్లతో మోదీ ఇంటికి వెళ్తాం: అరవింద్ కేజ్రీవాల్
ట్రంప్ ఒత్తిడితో అమెరికా నుంచి భారీగా ఇథనాల్ కొంటున్నారని ప్రధాని మోదీపై AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ డెసిషన్తో సామాన్యుల వాహనాలు డ్యామేజ్ అయ్యాయని ఆయన 'X' పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2 లక్షలకు పైగా పిటిషన్లతో ప్రధాని ఇంటికి వెళ్తున్నామని తెలిపారు. ఇథనాల్ (E20) కారణంగా తమ వెహికల్స్ దెబ్బతిన్నాయని చెప్పే 100 మంది మాతో ఉన్నారని అన్నారు. ప్రజల గొంతును ప్రధాని తప్పకుండా వింటారని ఆశిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.


