బ్లడ్ క్యాన్సర్తో విద్యాకుసుమం..కదిలిన విద్యార్థిలోకం

AP: చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, పేదరికంతో పోరాడుతూ ఇంటర్ ఫస్టియర్లో 446 మార్కులు సాధించాడు. ఇప్పుడు ఆ విద్యార్థి జీవితం బ్లడ్ క్యాన్సర్తో ఊగిసలాడుతోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడార్సింగి పంచాయితీ నరసింగపురం గ్రామానికి చెందిన సారక శివకుమార్ ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికోసం తోటి విద్యార్థులు గ్రామాలు తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. విద్యార్థి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయార్థం ఫోన్పే నెంబర్ 8074560021 కు సంప్రదించాలన్నారు.




