స్లీపర్ బస్సులో మంటలు..అందరూ సేఫ్
తమిళనాడు రాష్ట్రం పెరంబలూరు జిల్లాలోని చెన్నై-తిరుచ్చి హైవేపై మంగళమేడు దగ్గర్లో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి మదురై వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టక ముందే డ్రైవర్ బస్సులోని 23 మందిని కిందకు దింపాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు ట్రాఫిక్ను మళ్లించి దర్యాప్తు చేస్తున్నారు.



