అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు అభిజీత్ దీప్కే లెటర్

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులకు లెటర్ రాశాడు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను దేశం తెలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు ఇప్పటికీ సురక్షితమైన నీరు, టాయిలెట్లు, సరైన తరగతి గదులు, కూర్చోవడానికి బెంచీలు లేకుండా చదువుతున్నారని లెటర్లో ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఏ పిల్లవాడూ ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోకూడదు. వారిని జంతువుల కంటే ఘోరంగా చూస్తున్నారు” అని పేర్కొన్నారు.


