రాజ్యసభలో ‘లుంగీవాలా’ కామెంట్స్

కేరళకు చెందిన సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అని పిలిచారన్న ఆరోపణ రాజ్యసభలో కలకలంగా మారింది. దీనిపై బ్రిట్టాస్ ప్రత్యేక అధికార ఉల్లంఘన(ప్రివిలేజ్) నోటీస్ ఫైల్ చేశారు. రాజ్యసభలో ఇన్కమ్ టాక్స్(అమెండ్మెంట్) ఆర్డినెన్స్-2026పై స్టాట్యూటరీ రిజల్యూషన్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇలా జరిగిందని బ్రిట్టాస్ తెలిపారు. ఆ టైంలో ఆయన ధోతి వేసుకున్నారు. సుష్మితా దేవ్ తనను ‘లుంగీవాలా’ అని పిలిచారని, ఇది దక్షిణ భారతీయులు, మలయాళీల సంస్కృతిని అవమానించడమే అని ఆయన అన్నారు.



