పెండింగ్ సమస్యలపై విద్యుత్ ఉద్యోగుల బిగ్ ప్రొటెస్ట్

TG: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19న హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని జెన్కో ఉద్యోగులు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (KTPP) వద్ద మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఉద్యోగులు ఆవిష్కరించి నిరసన తెలిపారు. PRC-2026 అమలు, యాదాద్రి ప్లాంట్లో ఔట్సోర్సింగ్ నిలిపివేత, పెండింగ్ ప్రమోషన్లు, ఖాళీలభర్తీ, పాత పెన్షన్ విధానం అమలు తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు.



