MRI కోసం వెళ్తే.. 2028 వరకు వెయిటింగా?

MRI కోసం ఆసుపత్రికి వెళ్తే.. వెంటనే స్కాన్ చేస్తారని అనుకుంటాం. కానీ ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో కొందరు రోగులకు 2028 తేదీలు ఇస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్క MRI మెషీన్ మాత్రమే ఉండటం, భారీ రోగుల రద్దీ దీనికి ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. రోజుకు దాదాపు 10 MRI స్కాన్లు మాత్రమే చేయగలుగుతున్నట్లు నివేదిక తెలిపింది. అత్యవసర, ట్రామా కేసులకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారు. రోగికి సమయానికి పరీక్ష అందకపోతే.. వైద్యం అందుబాటులో ఉందన్న మాటకు అర్థమేంటి?



