← Back to news

MRI కోసం వెళ్తే.. 2028 వరకు వెయిటింగా?

By Nani Garikina· 1d ago· Indianexpress
MRI కోసం వెళ్తే.. 2028 వరకు వెయిటింగా?

MRI కోసం ఆసుపత్రికి వెళ్తే.. వెంటనే స్కాన్ చేస్తారని అనుకుంటాం. కానీ ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో కొందరు రోగులకు 2028 తేదీలు ఇస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్క MRI మెషీన్ మాత్రమే ఉండటం, భారీ రోగుల రద్దీ దీనికి ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. రోజుకు దాదాపు 10 MRI స్కాన్లు మాత్రమే చేయగలుగుతున్నట్లు నివేదిక తెలిపింది. అత్యవసర, ట్రామా కేసులకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నారు. రోగికి సమయానికి పరీక్ష అందకపోతే.. వైద్యం అందుబాటులో ఉందన్న మాటకు అర్థమేంటి?

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.