← Back to news

73 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలు ఇవే

By dk· 18 Aug 2026· హైదరాబాద్
73 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలు ఇవే

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.. సవరణకు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదాలో ఆ సంఖ్య 2,64,87,213కు తగ్గింది. ఆచూకీలేని, శాశ్వతంగా వలసవెళ్లిన, మరణించిన, ఇతర ప్రాంతాల్లో ఓటు కలిగిన వారిగా గుర్తించిన 73,39,235 మంది పేర్లను తొలగించారు. మరో 92,87,577 మంది ఓటర్ల వివరాలపై వ్యత్యాసాలు, మ్యాపింగ్ సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి నోటీసులు జారీచేసి సంజాయిషీ కోరనున్నట్లు తెలిపారు.

More in TG