భార్యాభర్తల హత్య వెనుక ఇద్దరు కానిస్టేబుళ్లు

TG: సూర్యాపేట జిల్లా మోతె మండలంలో భార్యాభర్తలు బూబా, నాగులు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనలో మోతె PSకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు షరీఫ్, సుందరయ్యల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బూబాతో షరీఫ్కు వివాహేతర సంబంధం ఉండడంతో ఆమె కుమార్తె వివాహానికి షరీఫ్ రూ.3లక్షలు అప్పుగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, తమ సంబంధాన్ని బయటపెడతానని బూబా బెదిరించింది. దీంతో షరీఫ్, సుందరయ్య భార్యాభర్తలపై రాడ్తో దాడిచేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు.



