ఢిల్లీలో సెప్టెంబర్ 5న CJP శాంతియుత నిరసన మార్చ్

Cockroach Janata Party(CJP) సెప్టెంబర్ 5న ఢిల్లీలో జాతీయ స్థాయి శాంతియుత నిరసన మార్చ్ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూలై 25న యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఈ అనౌన్స్మెంట్ చేసింది. ఈ మార్చ్ ఇండియా గేట్ వద్ద స్టార్ట్ అయ్యి ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వైపు సాగుతుందని తెలిపింది. మరణించిన నీట్ బాధితుల కుటుంబాలు, పోలీస్ దౌర్జన్య బాధితులు ఈ మార్చ్కు నాయకత్వం వహిస్తారని తెలిపింది.


