← Back to news

పెద్దపులి మృతి కేసులో బిగ్ ట్విస్ట్

By dk· 4 Aug 2026· మార్కాపురం జిల్లా
పెద్దపులి మృతి కేసులో బిగ్ ట్విస్ట్

AP: మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులను గుంటూరు జిల్లా మేడికొండూరులో అదుపులోకి తీసుకున్నారు. 20రోజుల క్రితం ఉచ్చులో చిక్కి మృతి చెందిన పెద్దపులి కాళ్లు నరికి గోళ్లు తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి పారదర్శక దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.