← Back to news

కేంద్ర ప్రభుత్వానికి 'కామన్ సెన్స్' లేదు: ప్రియాంక్ ఖర్గే

By Mahesh· 29 Jul 2026· కర్ణాటక
కేంద్ర ప్రభుత్వానికి 'కామన్ సెన్స్' లేదు: ప్రియాంక్ ఖర్గే

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రహ్లాద్ జోషి నుంచి పెద్ద సంస్కరణలు ఆశించడం పొరపాటేనని అన్నారు. 'ఆయన చాలాకాలంగా ఎంపీగా ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ విధానాలు, సంస్కరణను తీసుకురాలేదని' ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఆయన అండగా నిలుస్తారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం ఆశ్చర్యకరమని, ప్రభుత్వంలో 'కామన్ సెన్స్' లోపించిందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.

More in Politics