ధర్మస్థల్ 200 కోట్ల డీల్ పై.. ప్రెస్మీట్లో ప్రకాష్ రాజ్!

ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన రూ.200 కోట్ల డీల్లో నటుడు ప్రకాష్ రాజ్కు కూడా భాగస్వామ్యం ఉందంటూ మాజీ కార్మికుడు చిన్నయ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై బెంగళూరులో ప్రెస్మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే తనకు చిన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని, అతడితో ఒకేసారి ఫోన్ మాట్లాడినట్లు, ఆ జరిగిన ఫోన్ సంభాషణల రికార్డింగ్లను కూడా తానే సిట్ (SIT) అధికారులకు పంపానని స్పష్టం చేశారు. గతం లో ఆలయ ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్యను తానే కోరినట్లు ప్రకాష్ రాజ్ ప్రెస్మీట్లో వివరణ ఇచ్చారు.



