ధర్మేంద్ర ప్రధాన్ ను కడిగి పారేసిన రేణుక !
నీట్ పేపర్ లీక్ విషయంలో అక్రమార్కుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ ఆవరణలో ఉండగా.. అక్కడికి రేణుకా చౌదరి వచ్చారు... పక్కనే నిలబడి మోదీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు..! నిన్నటి కాక్రోచ్ ఆందోళన.. నేటి రైతుల ఆందోళనను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకు పడ్డారు... యూజ్ లెస్ ఫెలోస్ అంటూ విమర్శలు చేశారు... రేణుక అలా గట్టిగా వాయిస్ పెంచి ఎటాక్ చేస్తుండడంతో బిత్తరపోయిన ప్రధాన్ అటూ ఇటూ చూస్తూ మెల్లిగా అక్కడినుండి జారుకునే ప్రయత్నం చేశారు.. అయినప్పటికీ ఆమె వదలకుండా అతనితో పాటు మెట్లు దిగుతూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.



