చంద్రశేఖరన్ తర్వాత ఎవరు? టాటాలో కొత్త టెన్షన్!

TATA గ్రూప్లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది.. చంద్రశేఖరన్ తర్వాత ఎవరు? ఫిబ్రవరి 2027లో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగనని ఎన్. చంద్రశేఖరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు TATA ట్రస్ట్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతలో ఈరోజు జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సమావేశం కూడా అవసరమైన సభ్యులు లేక వాయిదా పడింది. దీంతో కొత్త బాస్ ఎవరు అన్నదానితో పాటు.. TATA లోపల అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి మరింత పెరిగింది.



