నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపాలి

TG: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన రాజేశ్వరరావును యాక్సిడెంట్ చేసి చంపాలని భార్య భవాని తన ప్రియుడు సైదులుకు మెసేజ్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్తకు అనుమానం రావడంతో ఆమె ఫోన్ పరిశీలించగా షాకింగ్ చాటింగ్ బయటపడింది. ఇంట్లో కాకుండా బయట ప్రమాదంగా చూపించి హత్య చేయాలని ఆమె సూచించినట్లు బాధితుడు రాజేశ్వరరావు ఆరోపించారు. చాటింగ్ ఆధారాలను పోలీసులకు అందించి భార్య, ఆమె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



