← Back to news

డీసీపీ కార్యాలయం బయట రాహుల్, ప్రియాంక ధర్నా

By Vishi· 21 Aug 2026· X

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోని డీసీపీ కార్యాలయం బయట కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాకు దిగారు. పెల్లెట్ గన్‌ ఘటనపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయాలని గాయపడ్డ విద్యార్థి సాహిల్ లోచబ్‌తో కలిసి రాహుల్ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల నిరసనలో సాహిల్‌కు పెల్లెట్ గన్‌తో గాయాలు అయ్యాయని తెలిపారు. అతని కంటిచూపు ప్రమాదంలో ఉందని వివరించారు. పైనుంచి ఆదేశాలున్నాయని అంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నో అంటున్నారని రాహుల్ ఆరోపించారు.

More in Current Affairs