శాతవాహన యూనివర్సిటీలో TRSV నిరాహార దీక్ష

TG: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా TRSV నాయకులు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీతో దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.



