అద్దెకు వచ్చి.. లక్షలతో ఉడాయించిన దంపతులు

AP: కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మోరగుడిలో నకిలీ బంగారం పేరుతో రూ.4 లక్షలు మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి గ్రామంలో అద్దెకు దిగిన దంపతులు స్థానికుడు సుబ్బరాయుడితో పరిచయం పెంచుకున్నారు. తమకు 44 తులాల బంగారు బిస్కెట్ దొరికిందని, తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మించారు. అనుమానం రాకుండా 2 గ్రాముల అసలు బంగారం ఇచ్చి పరీక్ష చేయించగా అది నిజమని తేలింది. దీంతో రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.4 లక్షలు తీసుకుని నకిలీ బంగారు బిస్కెట్ ఇచ్చి పరారయ్యారు.



