← Back to news

అద్దెకు వచ్చి.. లక్షలతో ఉడాయించిన దంపతులు

By dk· 6 Aug 2026· కడప జిల్లా
అద్దెకు వచ్చి.. లక్షలతో ఉడాయించిన దంపతులు

AP: కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మోరగుడిలో నకిలీ బంగారం పేరుతో రూ.4 లక్షలు మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి గ్రామంలో అద్దెకు దిగిన దంపతులు స్థానికుడు సుబ్బరాయుడితో పరిచయం పెంచుకున్నారు. తమకు 44 తులాల బంగారు బిస్కెట్ దొరికిందని, తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మించారు. అనుమానం రాకుండా 2 గ్రాముల అసలు బంగారం ఇచ్చి పరీక్ష చేయించగా అది నిజమని తేలింది. దీంతో రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.4 లక్షలు తీసుకుని నకిలీ బంగారు బిస్కెట్ ఇచ్చి పరారయ్యారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.