తరతరాలకు స్ఫూర్తి వియత్నాం హ్యూమన్ బ్రిడ్జ్... ఎందుకో తెలుసా?
వియత్నాం యుద్ధ కాలం నాటి ఓ గగుర్పాటు కలిగించే చారిత్రక సత్యం ఇది. అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించి అక్కడి వంతెనలన్నింటినీ కూల్చేసింది. సైన్యం ముందుకు వెళ్లే దారి మూసుకుపోయింది. కానీ అక్కడి మహిళలంతా కలిసి స్వయంగా ఒక "హ్యూమన్ బ్రిడ్జ్"లా మారారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, వియత్నామీస్ సైనికులు నది దాటడానికి దారినిచ్చారు. చరిత్ర పుటల్లో ఇదొక చెరిగిపోని దృశ్యం! తుపాకులు, బాంబులు తాత్కాలిక భయాన్ని సృష్టించగలవేమో గానీ... ఒక జాతి సంకల్పాన్ని మాత్రం ఏ శక్తీ లొంగదీసుకోలేదు అనడానికి వియత్నాం మహిళల త్యాగమే అతిపెద్ద నిదర్శనం! సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.



