← Back to news

ఒక్కసారిగా వణికిన ఫ్లోరెస్‌ ద్వీపం.. 47 మంది మృతి!

By Mahesh· 16 Aug 2026· ఇండోనేషియా

ఇండోనేషియాలోని ఫ్లోరెస్‌ ఐలండ్ దగ్గరలో నిన్న ఉదయం 5.58 గం. 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 47 మంది చనిపోగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని ప్రాంతాల నుంచి 2 వేల మందిని టెంపరరీ క్యాంప్స్‌కు తీసుకెళ్లారు. ల్యాండ్‌స్లైడ్స్ విరిగిపడటం, రోడ్లు డ్యామేజ్ అవ్వడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలిగాయి. ముందు సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, తర్వాత వాటిని విత్‌డ్రూ చేసుకున్నారు. ఇదే రోజు ఉత్తర సుమత్రాలో 6.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది.

More in Current Affairs