← Back to news

నేడు సౌత్ స్టేట్స్ CMలతో అమిత్‌ షా భేటీ.. Hot Topics ఇవే!

By Mahesh· 20 Aug 2026

తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా కోవళంలో 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ మీట్ ఈరోజు జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జరిగే ఈ భేటీకి సౌత్ స్టేట్స్ CMలు, అధికారులు హాజరవుతున్నారు. రాష్ట్రాల్లో సమస్యలు, నీటి పంపకాలు, ఎడ్యుకేషన్, హెల్త్, లా అండ్ ఆర్డర్, ఎకనామిక్ డెవలప్‌మెంట్‌పై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా కావేరీ వాటర్ డిస్ప్యూట్స్, ఏపీ-తెలంగాణ విభజన అంశాలపై చర్చకు ఇంపార్టెన్స్ ఉండనుంది. ఈ సమావేశాలు కేంద్ర-రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్, వివాదాల పరిష్కారానికి కీలక వేదికగా నిలుస్తున్నాయి.

More in Current Affairs