సూసైడ్ నోట్ రాసి ఏఎన్ఎం ఆత్మహత్య

AP: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమల గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న సాయి చందన ప్రియ(27) సచివాలయంలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. సచివాలయంలో లభించిన సూసైడ్ నోట్లో తండ్రి వైద్యం కోసం తన ఇన్సూరెన్స్ అమౌంట్ను కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.



