ఆగస్టు 18 వరకు ఆగని వానలు?

ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు, వరదల వల్ల 5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆగస్టు 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడమే కాకుండా అధికారుల లీవులను రద్దు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలైన భద్రక్, జాజ్పూర్ జిల్లాల్లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నారు.


