40 కి.మీ వేగంతో గాలులు, పిడుగుల ముప్పు..

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తెలిపింది.



