షాపింగ్ మాల్లో భారీ చోరీ

AP: విజయవాడ వన్టౌన్లోని పూనమ్ కలెక్షన్స్ షాపింగ్ మాల్లో రూ.30 లక్షల విలువైన నగదు, బంగారం చోరీ కలకలం రేపింది. పనిలో చేరిన నెలరోజులు కూడా కాకముందే నలుగురు పనివాళ్లు యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుకాణానికి ఉద్దేశపూర్వకంగా తాళాలు వేయకుండా వదిలేసి, అర్ధరాత్రి లోపలికి ప్రవేశించి రూ.30 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. అనంతరం రాజస్థాన్కు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.



