← Back to news

సర్కస్‌లో స్టంట్ చేస్తూ యువకుడు మృతి

By RK· 29 Jul 2026
సర్కస్‌లో స్టంట్ చేస్తూ యువకుడు మృతి

హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్కస్ చూపిస్తూ దీపక్(27) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సర్కస్ చివరి రోజున 'సజీవ సమాధి' అనే స్టంట్ కోసం దీపక్‌ను ఒక సంచిలో పెట్టి గొయ్యిలో పూడ్చారు. 24 గంటల తర్వాత అతన్ని బయటకు తీయాలి. కానీ ప్రేక్షకుల నుంచి రూ. 7,100 కలెక్షన్ వస్తేనే తీస్తామని నిర్వాహకులు చెప్పారట. దీంతో 36 గంటల పాటు దీపక్ లోపలే ఊపిరాడక చనిపోయాడు. చివరికి గొయ్యి తీసి చూస్తే శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 12h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.