స్టీలు ప్లేటులో పర్యావరణ పాఠం

TG: పాఠాలు చెప్పడమే కాదు..ఆచరించి చూపించి విద్యార్థులకు నేర్పుతాం అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు. జిల్లా స్థాయి శిక్షణలో టీచర్లు తమ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన అందించేందుకు లంచ్ టైంలో ఇంటి నుండి తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లలో తిన్నారు. ఇళ్ల నుంచే స్టీల్ ప్లేట్స్, గ్లాసులు, బాటిళ్లు తెచ్చుకోవాలని పిల్లలకు చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విడిచిపెట్టి, పర్యావరణరహితమైన వస్తువులనే వాడాలని తెలిపారు.



