← Back to news

యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్ల టోకరా

By Venkat.V· 19 Aug 2026

AP: ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో ‘ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్’ కంపెనీ తప్పుడు సమాచారంతో విజయవాడ యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్లు మోసం చేసింది. బ్యాంక్ లోన్ వచ్చాక ఆరు నెలల్లో కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేశారు. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఏజీఏం సీబీఐకి ఫిర్యాదు చేశారు. కంపెనీ డైరెక్టర్లు, బ్యాంక్ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.