బాంకీపూర్ బైపోల్: 11,500 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్!

బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల లెక్కింపులో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 11,500 ఓట్ల ముందంజ సాధించారు. 1995 నుంచి ఉన్న బీజేపీ మూడు దశాబ్దాల ఆధిపత్యానికి ఇది పెద్ద దెబ్బ. నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.


