డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

TG: ఉదయం లక్డీ-కా-పుల్లోని డీజీపీ కార్యాలయంలోని వాష్రూమ్లో స్వామి అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని దగ్గర లభించిన లేఖలో 'తన భార్యాపిల్లల గురించి ఎవరూ ఏమీ అనకూడదని, తాను చనిపోయి దెయ్యంగా మారినా వారిని చూసుకుంటూనే ఉంటానని, వారు మంచివారని' రాశాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు తరలించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.



