నీట్ రీ-టెస్ట్ ఎఫెక్ట్: 37 రోజుల్లో 12 మంది విద్యార్థుల ఆత్మహత్య!

పేపర్ లీక్ వివాదంతో మే 3న జరిగిన నీట్-యుజి (NEET-UG) పరీక్ష రద్దు కావడం, రేపు మళ్లీ రీ-టెస్ట్ నిర్వహించాల్సి రావడంతో విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఆందోళన వ్యక్తమవుతోంది. పరీక్ష రద్దయిన ఈ 37 రోజుల్లోనే దేశవ్యాప్తంగా కనీసం 12 మంది మెడికల్ అభ్యర్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు రాసి సీటు వస్తుందనుకున్న తరుణంలో, మళ్లీ రాయాలనే భయం, నిరాశే ఈ ఘోరాలకు కారణమని తెలుస్తోంది.



