GO 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 (శక్తి స్కీమ్) వల్ల తమ మూడేళ్ల చదువు వృథా అవుతుందని వికారాబాద్తో పాటు పలు చోట్ల నిరసన తెలిపారు. ఈ జీవో వల్ల డిప్లొమా పూర్తయ్యాక నేరుగా ఇంజినీరింగ్ చదివే అవకాశం పోతుందని, మళ్లీ ఇంటర్ చదవాల్సి వస్తుందని బాధపడ్డారు. డిప్లొమా ప్రాధాన్యతను తగ్గించే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయగా,BRS మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విద్యార్థులకు మద్దతు ఇచ్చారు.



