GMRను ఎందుకు మాట్లాడించలేదు: గుడివాడ

AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అయితే, విమానాశ్రయం నిర్మాణానికి అసలు క్రెడిట్ YS జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. YSRCP హయాంలో భూసేకరణ పూర్తి చేసి, న్యాయ వివాదాలు పరిష్కరించి, నిర్మాణ పనులు వేగవంతం చేశామని చెప్పారు. కార్యక్రమంలో GMR సంస్థ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. GMR మాట్లాడితే విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలిసేవని అన్నారు.


