పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

TG: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 5వ డివిజన్లోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన మొక్కలతో వనమహోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్, కమిషనర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటారు.



