మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలి
దిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని మోదీ నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆయన మాట్లాడారు. విద్యార్థులపై జరిగిన దాడి, వారి ఆందోళనలను అణిచివేయడం వల్ల యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. పోటీపరీక్షల వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు తగ్గిస్తున్నారని ఫైరయ్యారు. హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులను కొట్టిన ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.



