← Back to news

గురుకుల పాఠశాల కోసం రోడ్డెక్కిన మారికవలస గిరిజనులు

By Vishi· 28 Aug 2026
గురుకుల పాఠశాల కోసం రోడ్డెక్కిన మారికవలస గిరిజనులు

AP: మారికవలస బాయ్స్ గిరిజన గురుకుల పాఠశాలను పూర్తిగా ఎత్తివేసి, ఆ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబుతో కలిసి వారంతా నిరసన తెలియజేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఇప్పటికే వందలాది మంది గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్న మారికవలస గురుకులాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదని నినాదాలు చేశారు.

More in AP