బంగ్లాదేశ్ ప్రధాని భారత్కు వస్తారా?

బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ ఆగస్టు 23–25 మధ్య ఢిల్లీకి వస్తారనే వార్తలు వచ్చినా… టూర్ ఇంకా ఫైనల్ కాలేదు. ఢిల్లీ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం భారత్ నుంచి కొన్ని విషయాల్లో స్పందన కోసం ఎదురుచూస్తోందని రెహ్మాన్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అంశం రెండు దేశాల మధ్య ఇంకా సెన్సిటివ్గా ఉంది. ఇదే సమయంలో రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనను విడుదల చేసి గంటలోపే వెనక్కి తీసుకోవడంతో మరింత గందరగోళం ఏర్పడింది.



