← Back to news

చెరువులో మునిగిన ఇద్దరు చిన్నారులు

By DK· 30 Jul 2026· పల్నాడు జిల్లా
చెరువులో మునిగిన ఇద్దరు చిన్నారులు

AP: పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. తోటి విద్యార్థులతో కలిసి చెరువు వద్దకు వెళ్లిన బమ్మిడి శివ, కొడవటికంటి కిరణ్ ఈత కొడుతుండగా లోతైన నీటిలో చిక్కుకుని మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 13h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.